2030 నాటికి దేశం 150 గిగావాట్ అవర్ అడ్వాన్స్కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) లక్ష్యాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన 3వ వార్షిక ఇండియా బ్యాటరీ తయారీ సప్లై చైన్ సమ్మిట్ 'ఐబీఎంఎస్సీఎస్'లో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. దేశంలోని 150 ఏసీసీ గిగావాట్అవర్ బ్యాటరీ తయారీలో, తెలంగాణ వాటా 30 గిగావాట్ అవర్ ఉందని చెప్పారు. రాష్ట్రంలో 16 గిగావాట్అవర్ తయారీ కేంద్రం ఏర్పాటుకు అమర రాజా పెట్టుబడులు పెడుతున్నదని ఆయన పేర్కొన్నారు. వారం రోజుల క్రితం దావోస్లో తెలంగాణ ప్రభుత్వం 12 గిగావాట్ అవర్ బ్యాటరీ తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం జీఓడీఐతో ఒప్పందంపై సంతకం చేసిందని, కొన్ని ఇతర కంపెనీలతో చర్చలు ముగింపుదశల్లో ఉన్నాయని ఆయన వివరించారు.
12 గిగావాట్ అవర్ బ్యాటరీ తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం జీఓడీఐతో ఒప్పందం
الأربعاء، 24 يناير 2024
12 గిగావాట్ అవర్ బ్యాటరీ తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం జీఓడీఐతో ఒప్పందం 3వ వార్షిక ఇండియా బ్యాటరీ తయారీ సప్లై చైన్ సమ్మిట్ science technology telangana
ليست هناك تعليقات:
إرسال تعليق