''యాపిల్ కుపెర్టినోలో సీఈవో టిమ్ కుక్ని కలుసుకోవడం మర్చిపోలేని క్షణం ! ధన్యవాదాలు, టిమ్. అద్భుతమైన ఆపిల్ పార్క్ని , మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది!'' అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు ఈ సారి మీరు భారత పర్యటనకు వచ్చినపుడు బ్యాడ్మింటన్ ఆడతాను అంటూ మరో పోస్ట్లో పేర్కొంది. ఈ పోస్ట్లకు ఇప్పటికే సింధు అభిమానులు, అనుచరుల నుండి లైక్లు, కామెంట్లు వెల్లువెత్తాయి. మిమ్మల్ని ఈ స్థాయిలో చూడటం గర్వంగా ఉందని ఒకరు, యాపిల్ కుపెర్టినోలో కూడా బ్యాడ్మింటన్ సంఘం ఉంది అంటూ మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు. కాగా USB-Cతో Apple Watch Series 9 , Airpods Proతో పాటు iPhone 15 సిరీస్ను విడుదల చేసింది. ఐఫోన్ 15 128 జీబీ స్టోరేజ్కు రూ. 79,900 నుండి ప్రారంభమైతే, ఐఫోన్ 15 ప్లస్ రూ. 89,900 నుండి ప్రారంభమవుతుంది. iPhone 15 Pro 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,34,900 , iPhone 15 Pro Max 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,59,900 నుండి ప్రారంభమవుతుంది.
టీమ్ కుక్తో సెల్ఫీ దిగిన పీవీ సింధు
الأربعاء، 13 سبتمبر 2023
apple Apple iPhone 15 science technology టీమ్ కుక్తో సెల్ఫీ దిగిన పీవీ సింధు మర్చిపోలేని క్షణం ! ధన్యవాదాలు యాపిల్ కుపెర్టినో
అమెరికా లోని కుపెర్టినోలో యాపిల్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఐఫోన్ 15 సిరీస్ విడుదల కార్యక్రమంలో బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు హాజరైంది. ఈ ఈవెంట్కు హాజరైనట్టు ఇన్స్టాలో షేర్ చేసిన సింధు యాపిల్ సీఈఓ టిమ్ కుక్తో సెల్ఫీలను కూడా పోస్ట్ చేసింది. దీంతో ఈ పిక్స్ వైరల్గా మారాయి.
ليست هناك تعليقات:
إرسال تعليق