మారుతి సుజుకి ఇండియా ఐదు డోర్ల జిమ్నీ SUVని తీసుకొచ్చేందుకు సిద్దమవుతుంది. ఆఫ్-రోడర్ ప్రారంభానికి ముందే మారుతి సుజుకి రాబోయే జిమ్నీ SUV మోడల్ కొనుగోలుపై 30వేల బుకింగ్లను పూర్తి చేసినట్టు రిపోర్టు తెలిపింది. రాబోయే జిమ్నీ SUV మోడల్ ధర మరో వారంలో ప్రకటించనుంది. జిమ్నీ ధర రూ. 11 లక్షల నుంచి రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్లో ఉంటుందని భావిస్తున్నారు. మారుతీ సుజుకి జిమ్నీ సేల్స్ ఆఫ్-రోడర్ కస్టమర్ డెలివరీలు జూన్ మొదటి వారం నుంచి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. జనవరి 12న ఫ్రాంక్స్తో పాటు జిమ్నీ బుకింగ్లు ప్రారంభమయ్యాయి. రెండు SUVలను ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్పోలో ఆవిష్కరించింది. మారుతి ఇప్పుడు తన పోర్ట్ఫోలియోలో నాలుగు SUVలను కలిగి ఉంది. అందులో Fronx, Brezza, Jimny, Grand Vitara ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (FY24)లో SUV మార్కెట్లో 25శాతం వాటాను కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక సంవత్సరం (FY23)లో SUV వాల్యూమ్లు 1,673,000 యూనిట్లుగా ఉండగా, FY24లో దాదాపు 1,900,000 యూనిట్లకు పెరుగుతాయని అంచనా. మారుతి జిమ్నీ జనాదరణ పొందిన థార్తో పోటీ పడుతోంది. థార్ ఇప్పుడు 4WD, RWDతో అందించనుంది. జిమ్నీలో, 4WD (ALLGRIP PRO) ప్రామాణికమైనదిగా చెప్పవచ్చు. మారుతి SUVతో పాటుగా ఉంటుంది. జిమ్నీ పాత K15B 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (105PS/134Nm) నుంచి పవర్ అందిస్తుంది. 5-స్పీడ్ MT లేదా 4-స్పీడ్ ATతో రావొచ్చు. లాడర్ ఫ్రేమ్ చాసిస్ ఆధారంగా, ఆఫ్-రోడర్ ALLGRIP PRO 4WD టెక్నాలజీతో లో-రేంజ్ ట్రాన్స్ఫర్ గేర్ (4L మోడ్) స్టాండర్డ్ ఫీచర్లతో వస్తుంది.
ఐదు డోర్ల మారుతి సుజుకి జిమ్నీ !
الثلاثاء، 23 مايو 2023
automobile technology ఐదు డోర్ల మారుతి సుజుకి జిమ్నీ మారుతి సుజుకి ఇండియా రాబోయే జిమ్నీ SUV మోడల్ ధర మరో వారంలో ప్రకటించనుంది
ليست هناك تعليقات:
إرسال تعليق