ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లాలో ఉన్న ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్లో భోజనం చేసిన తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురైన ఇద్దరు విద్యార్థులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన వారిని 12 ఏళ్ల నితిన్, 8 ఏళ్ల అరుణ్ కుమార్గా గుర్తించారు. ఆరోగ్యం క్షీణించడానికి ముందు ఆ పిల్లలు హాస్టల్లో చట్నీతో కూడిన మోమోస్ తిన్నారు. అనారోగ్యానికి గురైన వెంటనే పాఠశాల యాజమాన్యం వారిని ఆసుపత్రికి తరలించింది. హాస్టల్లో చట్నీతో కూడిన మోమోస్ తిన్న కొద్దిసేపటికే విద్యార్థులిద్దరూ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గమనించిన పాఠశాల యాజమాన్యం, సిబ్బంది వెంటనే వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో వైద్యులు అందించిన చికిత్స ఫలించక ఆ చిన్నారులిద్దరూ మృతి చెందారు. ఫుడ్ పాయిజనింగ్ వల్లే ఈ ఘోరం జరిగిందా అనే సందేహంతో అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు విద్యార్థులు తిన్న మోమోస్ మరియు చట్నీ ఆహార నమూనాలను సేకరించి పరిశోధన నిమిత్తం ల్యాబ్కు పంపించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు కేసు నమోదు చేసి లోతైన విచారణ జరుపుతున్నారు.
ホーム
/
Uttar Pradesh
/
ప్రైవేట్ హాస్టల్లో మోమోస్ తిని ఇద్దరు విద్యార్థులు దుర్మరణం
الثلاثاء، 18 أغسطس 2026
2-year-old Nitin and 8-year-old Arun Kumar Banda district Two Students Die After Eating Momos at Private Hostel Uttar Pradesh
ليست هناك تعليقات:
إرسال تعليق