మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడలేని ఆటోరిక్షా, ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీ నేర్చుకునేందుకు ప్రభుత్వం మరో ఏడాది గడువు ఇచ్చింది. ఈ కాలంలో భాషా నిబంధనను పాటించలేదనే కారణంతో డ్రైవర్ల లైసెన్స్లు, పర్మిట్లు రద్దు చేయబోమని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. మరాఠీ మాట్లాడలేని ఆటోరిక్షా, ట్యాక్సీ డ్రైవర్ల లైసెన్స్లు, పర్మిట్లు రద్దు చేసే అవకాశం ఉందని కొద్ది రోజుల క్రితమే మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర చర్చ, నిరసనలు మొదలయ్యాయి. ఆటోరిక్షా, ట్యాక్సీ డ్రైవర్ల సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కలిసి తమ సమస్యలను వివరించారు. మరాఠీ నేర్చుకునేందుకు డ్రైవర్లకు మరో ఏడాది సమయం ఇవ్వాలని కోరారు. వారి విజ్ఞప్తిని అంగీకరించిన ప్రభుత్వం.. అదనంగా ఏడాది గడువు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది వ్యవధిలో మరాఠీ భాషా నిబంధనను పాటించలేదనే కారణంతో డ్రైవర్లపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో మరాఠీయేతర ఆటో, క్యాబ్ డ్రైవర్లకు తాత్కాలికంగా ఉపశమనం లభించింది.
ఆటోరిక్షా, ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీ నేర్చుకునేందుకు మరో ఏడాది గడువు ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
الخميس، 27 أغسطس 2026
Auto-Rickshaw and Taxi Drivers Another Year to Learn Marathi Chief Minister Devendra Fadnavis Maharashtra Government Grants national
ليست هناك تعليقات:
إرسال تعليق