\
ప్రపంచవ్యాప్తంగా జూలై 30 న విడుదలైన 'స్పైడర్ మ్యాన్ మూవీ కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 7,694 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ విదేశాల్లోనే కాదు భారత్ లోనూ సంచలన విజయం దిశగా దూసుకెళ్తోంది. దేశవ్యాప్తంగా మొదటిరోజే ఏకంగా రూ. 61 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు చేసింది. రెండో రోజు రూ. 38 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అదే విధంగా మూడో రోజు ఏకంగా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక నాలుగో రోజు మరో 77 కోట్లు కొల్లగొట్టింది. మొత్తంగా చూస్తే అన్ని భాషలు కలిపి ఈ చిత్రానికి ఫస్ట్ వీకెండ్ లో దాదాపు రూ. 300 కోట్ల వరకు వసూల్లు రాబట్టినట్లు స్పష్టం అవుతోందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణ నుంచి ఏకంగా రూ. 23 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చాయి. అలాగే ఏపీ నుంచి రూ. 12 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. నార్త్ అమెరికాలో ఈ మూవీకి ఏకంగా 350 కు పైగా మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు స్పష్టం అవుతోంది. అలాగే వరల్డ్ వైడ్ గా 920 కు పైగా మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇలా ఫస్ట్ వీకెండ్ లో ఈ చిత్రానికి ఏకంగా 7,694 కోట్ల రూపాయిల గ్రాస్ రాబట్టినట్లు స్పష్టం అవుతోంది.