ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగిశాయి. కోట్లాది సంఖ్యలో ఇరాన్ ప్రజలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఖమేనీతో సహా ఆయన కుటుంబీలకు చనిపోయారు. దాదాపు నాలుగు నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు ఆయన స్వస్థలం మషాద్లో ముగిశాయి. అయితే, ఈ అంత్యక్రియల్లో ''మాస్క్'' ధరించిన వ్యక్తిపై అంతా ఆసక్తి నెలకొంది. అతను ఎవరనే దానిపై పలు రకాలు కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుత సుప్రీం లీడర్, ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ మాస్క్ ధరించి వచ్చాడనే ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే, మాస్క్ మ్యాన్ మొజ్తబా ఖాదని తేలింది. ఇరాన్ మీడియా ఇతడిని ఖమేనీ పెద్ద మనవడిగా గుర్తించింది. అంత్యక్రియల ప్రార్థన సమయంలో నల్లని ఫేస్ మాస్క్, నల్లని బేస్బాల్ క్యాప్ ధరించిన ఒక వ్యక్తి ముందు వరుసలో కూర్చుని కనిపించారు. ముసుగు ధరించిన ఆ వ్యక్తిని ఖమేనీ పెద్ద మనవడు మొహమ్మద్ జవాద్ ఖమేనీగా గుర్తించారు. అతను ఖమేనీ కుమారుడు మొజ్తాబా ఖమేనీ అని విస్తృత ఊహాగానాలు చెలరేగాయి. ఫిబ్రవరి 28 దాడిలో జవాద్ ముఖంపై తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ కారణాల వల్లే అంత్యక్రియలకు హాజరైనప్పుడు అతను మాస్క్ ధరించాల్సి వచ్చిందని చెబుతున్నారు. మరోవైపు, ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేదు. యూఎస్ ఇంటెలిజెన్స్ ప్రకారం.. దాడుల్లో మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడి, ముఖం వికృతంగా మారిందని చెబుతోంది. దాడి జరిగిన సమయంలో మొజ్తబా తన తండ్రి నివాసంలోనే ఉన్నారని, వేరే గదిలో ఉండటంతో తీవ్ర గాయాలతో బయటపడ్డారని తెలుస్తోంది.
అయతుల్లా ఖమేనీ అంత్యక్రియల్లో మాస్క్ ధరించిన వ్యక్తి ఎవరు ?
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق