ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రావడంతో పీఎఫ్ ఖాతాదారులకు ఉపశమనం లభించింది. కొన్ని రోజులుగా నిలిచిపోయిన ఈ సేవలు నేటి నుంచి తిరిగి పని చేస్తున్నాయి. సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన సేవలు ఇప్పుడు యథావిధిగా అందుబాటులో ఉన్నాయని అధికారికంగా ప్రకటించారు. ఖాతాదారులు తమ పనులు పూర్తి చేసుకోవడానికి వెబ్సైట్ ఓపెన్ చేయవచ్చు. అదనపు భద్రతా పరమైన ధ్రువీకరణల వల్ల పీఎఫ్ క్లెయిమ్స్, పాస్బుక్ అప్డేట్ ప్రక్రియకు కొంత సమయం పట్టవచ్చు. సాధారణం కంటే ఈ సేవలు పూర్తి కావడానికి మరో రెండు వారాల సమయం అదనంగా తీసుకునే అవకాశం ఉంది. సిస్టమ్ అప్గ్రేడ్ చేయడం వల్ల ఈ తాత్కాలిక జాప్యం జరుగుతుంది. అప్గ్రేడ్ తర్వాత యూఏఎన్ యాక్టివేషన్, డైరెక్ట్ యూఏఎన్ కేటాయింపులను ఉమాంగ్ యాప్కి మార్పు చేశారు. వీటిని పూర్తి చేయడానికి ఆధార్ ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి చేశారు. పోర్టల్లో మిగిలిన సేవలు అన్నీ పాత పద్ధతిలోనే అందుబాటులో ఉన్నాయి.
0 Comments