ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని పులేకమ్మ గుడి వద్ద సోమవారం తెల్లవారుజామున ఆగి ఉన్న బంగాళదుంపల లారీని గోధుమల లోడుతో వస్తున్న మరో లారీ బలంగా ఢీకొంది. మంటలు భారీగా చెలరేగడంతో గోధుమల లారీ దగ్ధమైంది. క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ కిరణ్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మృతుడు ఆదిలాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Post a Comment

أحدث أقدم