హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన భారత నౌకలపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ప్రకటన చేశారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 11 భారత నౌకలు జలసంధిని దాటాయని ఆయన వెల్లడించారు. ఇంకా 13 నౌకలు పర్షియన్ గల్ఫ్ వద్ద చిక్కుకుపోయినట్లు తెలిపారు. మిగతా నౌకలు తిరిగి ఇండియా సురక్షితంగా చేరేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు జైశ్వాల్ చెప్పారు. ఈ విషయంలో ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఇరాన్తో చర్చలు, సంప్రదింపుల తర్వాత ఇండియా ఈ అంశంలో ముందడుగు స్థితిలోనే ఉందన్నారు. 11 నౌకలు హార్ముజ్ నుంచి సురక్షితంగా ఇండియా చేరాయన్నారు. మిగిలిన నౌకల్ని కూడా ఇండియా రప్పించేందుకు ఇరాన్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ చమురు రవాణాకు సంబంధించి హార్ముజ్ జలసంధి అత్యంత కీలకం అనే సంగతి తెలిసిందే. హార్ముజ్ మూసివేయడంతో అనేక దేశాలు చమురు సమస్యను ఎదుర్కొంటున్నాయి.
పర్షియన్ గల్ఫ్ వద్ద చిక్కుకుపోయిన 13 నౌకలు : ఇండియా సురక్షితంగా చేరేందుకు నిరంతరం ప్రయత్నాలు
الخميس، 7 مايو 2026
13 Ships Stranded in the Persian Gulf Continuous Efforts Underway to Ensure Safe Return to India national Randhir Jaiswal Spokesperson for the Ministry of External Affairs
ليست هناك تعليقات:
إرسال تعليق