తెలంగాణలో ఏప్రిల్ 18, 19 తేదీల నుండి పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని 'తెలంగాణ వెదర్‌మ్యాన్' అంచనా వేశారు. తొలుత వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ప్రారంభమై ఏప్రిల్ 20 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాలకు ఈ వర్షాలు విస్తరించనున్నాయి. హైదరాబాద్‌లో కూడా ఏప్రిల్ 19 నుంచి 23 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి కాస్త ఉపశమనం లభించనుంది. అయితే, ఈ ఉరుములతో కూడిన వర్షాలు ప్రధానంగా సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో పడతాయని, కాబట్టి పగటిపూట ఎండ తీవ్రత యథావిధిగా కొనసాగుతుందని వాతావరణ నివేదిక పేర్కొంది. 

Post a Comment

أحدث أقدم