తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అకాల వర్షం అన్నదాతను నిలువునా ముంచింది. జిల్లాలోని పలు మండలాల్లో పంటలు నీట మునిగాయి. ముఖ్యంగా పాల్వంచ మండలంలోని పలు గ్రామాల్లో పంట నష్టం తీవ్రంగా ఉంది. పాల్వంచ మండలంలోని పలు గ్రామాల్లో సాగు చేసిన మొక్కజొన్న, వరి పంటలు ఈ వర్షానికి భారీగా దెబ్బతిన్నాయి. పూసల తండాకు చెందిన ఓ రైతు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. "పంట చేతికి వచ్చే తరుణంలో ఈ అకాల వర్షం మా కొంప ముంచింది. పెట్టుబడి కూడా వచ్చేలా లేదు, పూర్తిగా మొక్కజొన్న చేను నేలకొరిగింది" అని కన్నీటి పర్యంతమయ్యారు. ఆకాశం వైపు చూస్తూ గంపెడాశతో ఎదురుచూసిన రైతులకు, ఈ వర్షం కోలుకోలేని దెబ్బ తీసింది. అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలు కళ్లముందే పాడైపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వం వెంటనే గుర్తించి, పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని పాల్వంచ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
అన్నదాతను నిలువునా ముంచిన అకాల వర్షం : దెబ్బతిన్న మొక్కజొన్న, వరి
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق