కొత్త టీవీల్లో 'ఇన్-బిల్ట్ శాటిలైట్ ట్యూనర్',  'స్మార్ట్ ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్ గైడ్' ఫీచర్లు ఉండనున్నాయి. దీనివల్ల దూరదర్శన్‌కు చెందిన డీడీ ఫ్రీ డిష్ ఛానెళ్లను చూడటానికి విడిగా సెట్-టాప్ బాక్స్ అవసరం ఉండదు. గూగుల్,  యూట్యూబ్‌తో కలిసి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా మీడియా మరియు క్రియేటివ్ రంగంలో ఉన్న వారికి ఏఐ సాంకేతికతపై శిక్షణ ఇస్తారు. క్రియేటర్ల కోసం 'MyWAVES' అనే కొత్త ప్లాట్‌ఫారమ్‌ను కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ పరిచయం చేసింది. ఇది కేవలం కంటెంట్ చూడటానికే కాకుండా, షార్ట్ వీడియోలు మరియు ఎపిసోడిక్ కంటెంట్‌ను క్రియేట్ చేసి షేర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కంటెంట్ క్రియేషన్, మీడియా, డిజిటల్ ఆర్ట్స్ వంటి సృజనాత్మక రంగాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏఐ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ కింద సుమారు 15,000 మందికి యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ వంటి రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

Post a Comment

أحدث أقدم