హైదరాబాద్ లోని బోరబండ పరిధిలో మద్యం మత్తులో సిగరెట్ తాగుతుండగా సోఫాకు నిప్పంటుకుని విశ్రాంతి సైనికోద్యోగి చనిపోయాడు.  సెక్టార్‌ ఎస్‌ఐ కాశయ్య తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నకేశవులు (67) విశ్రాంతి సైనికోద్యోగి. భార్య, ఇద్దరు కుమారులతో కలిసి హెచ్‌ఎఫ్‌ నగర్‌ ఫేజ్‌-1 బస్తీలో నివాసముంటున్నాడు. ఆయనకు మద్యం, సిగరెట్ తాగే అలవాటు ఉంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చెన్న కేశవులు భవనం పైగదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం ఆయన ఉన్న గది నుంచి మంటలు రావడంతో భార్య, స్థానికులు వెళ్లి చూడగా.. సోఫాలోనే పూర్తిగా కాలిపోయి ఉన్నాడు. చెన్నకేశవులు మద్యం మత్తులో సిగరెట్‌ తాగుతున్న క్రమంలో సోఫాకు నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగి కాలిపోయి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 

Post a Comment

أحدث أقدم