ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి విడదల రజినిపై తాజాగా నమోదైన కేసుపై స్పందిస్తూ కూటమి ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు నాయుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, దానిని ప్రశ్నించినందుకే తమపై భౌతిక దాడులు చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. అంబటి రాంబాబు, జోగి రమేశ్ వంటి కీలక నేతలపై ఒక పద్ధతి ప్రకారం దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. అంబటి ఇంటిపై దాడి చేసిన వారు మళ్ళీ వస్తామని బెదిరించడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు.  చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ గుడిలో పూజలు చేయడానికి వెళ్తే చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తన అనుచరులతో మాపై దాడి చేయించారు. మాపై దాడి చేయడమే కాకుండా, తిరిగి మాపైనే కేసులు పెట్టించడం దారుణం అని రజని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒక బీసీ మహిళనని, మాజీ మంత్రిగా ఉన్న తనపైనే ఇన్నిసార్లు దాడులు జరిగితే, సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ తేల్చిందని, నిజాలు బయటపడుతున్నాయనే భయంతోనే చంద్రబాబు హింసను ప్రేరేపిస్తున్నారని రజని పేర్కొన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని విమర్శించారు.

Post a Comment

أحدث أقدم