చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రాంతానికి చెందిన క్వియావో అనే యువకుడు చెత్తను సేకరించి విక్రయించే పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతనకి చిన్న చిన్న మైక్రో చిప్స్ నుంచి విలువైన లోహాలను వేరు చేయడం అంటే చాలా ఆసక్తి. ఈ ఆసక్తితోనే అతను సరికొత్త ఆలోచన చేశాడు. జనాలు వాడి పడేసిన సిమ్ కార్డులను సేకరించడం స్టార్ట్ చేశాడు. వీటితో పాటు చెత్తను సేకరించే సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉండే మదర్ బోడ్స్ను కూడా కలెక్ట్ చేసేవాడు. ఇలా కలెక్ట్ చేసిన వాటిని అన్నింటిని తన షాప్లో ఉంచుకొని ఖాళీ సమయం దొరికినప్పుడల్లా వాటి నుంచి బంగారాన్ని వేరు చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా వాటి నుంచి ఏకంగా రూ.27 లక్షల విలువైన సుమారు 200గ్రాముల బంగారాన్ని ఇతను వేరు చేయగలిగాడు. అయితే ఇదేమి అంత ఈజీ పని కాదు. ఎందుకంటే ఒక్క సిమ్కార్డులో కేవలం 0.001 మిల్లీగ్రాముల బంగారం మాత్రమే ఉంటుంది. అలాంటిది అతను ఏకంగా 200 గ్రాముల బంగారాన్ని తీశాడు అంటే అతను ఎన్ని సిమ్కార్డులను సేకరించి ఉంటాడో అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. ఈ బంగారాన్ని సేకరించేందుకు ఏకంగా నాలుగున్నర లక్షల వరకు సిమ్కార్డులు, మైక్రో చిప్స్ సేకరించి వాటి నుంచి బంగారాన్ని వేరు చేశాడు. దీని గురించి చెప్తూ క్వియానో ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చూసిన చాలా మంది జనాలు తమదైన రీతిలో స్పందించారు.
సిమ్కార్డుల నుంచి 200 గ్రాముల బంగారం తీసిన చైనా యువకుడు!
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق