అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు : నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు


మెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌ ఇంటిపై కాల్పుల కలకలం రేపుతున్నాయి. ఒహియో రాష్ట్రం సిన్సినాటిలోని జేడీ వాన్స్‌ నివాసంపై అగంతకుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జేడీ వాన్స్‌ ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. కాల్పులతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. అయితే ఈ కాల్పులు జరిగిన సమయంలో జేడీవాన్స్‌ దంపతులు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన తర్వాత వాన్స్ నివాసం చుట్టూ భద్రతను పెంచారు. సీక్రెట్ సర్వీస్, ఎఫ్‌బీఐ బృందాలు కూడా దర్యాప్తు ప్రారంభించాయి. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 'జేడీ వాన్స్‌ను లక్ష్యంగా చేసిన దాడి కావచ్చని' పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై జేడీ వాన్స్‌ కార్యాలయం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. అమెరికా ఉపాధ్యక్షుడి నివాసంపై కాల్పులు జరగడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఇది రాజకీయ ప్రేరేపిత దాడి కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన చర్చాంశనీయంగా మారింది. ఈ ఏడాది అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అమెరికా కాంగ్రెస్‌ (సెనేట్‌, హౌస్‌), గవర్నర్‌ ఎన్నికలు, రాష్ట్ర శాసన సభలు వంటి కీలక పదవులు ఖాళీ అవుతాయి. 

Post a Comment

0 Comments