హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో తండ్రి దుర్మరణం, కుమారుడికి తీవ్రగాయాలు


హైదరాబాద్ లోని హయత్​ నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని పెద్ద అంబర్​పేట సమీపంలో నేషనల్​ హైవే 65 సర్వీస్​ రోడ్డుపై తండ్రి కొడుకులు పండుగకు సొంత ఊరెళ్తూ రోడ్డు ప్రమాదంలో తండ్రికి తీవ్రగాయాలై స్పాట్​లోనే దుర్మరణం చెందాడు. కుమారుడు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హయత్​ నగర్​ సీఐ నాగరాజ్​ గౌడ్​ వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన గంజి అశోక్​ (55) హయత్​నగర్​ పరిధిలోని మునగనూరులో ఉంటూ చేనేత కార్మికుడిగా పనిచేసుకుంటున్నాడు. గురువారం సంక్రాంతి పండుగ కావడంతో బుధవారం తన కుమారుడు ఉమాకాంత్‌తో కలిసి పల్సర్ బైక్​పై ఊరికి బయలుదేరారు. బైక్​ను ఉమాకాంత్ నడుపుతుండగా వారిద్దరూ మునగనూర్ నుంచి NH-65 సర్వీస్ రోడ్డు మీదుగా పెద్దఅంబర్‌పేట వైపు వెళ్తున్నారు. సీతారాంపురం కమాన్ సమీపంలోకి చేరుకోగానే సుజుకి యాక్సెస్ బైక్​ వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అశోక్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. ఉమాపతి స్వల్ప గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజ్​గౌడ్​ తెలిపారు.

Post a Comment

0 Comments