పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై హైదరాబాద్ ఐఐటీ సహకారంతో సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖను ఆదేశించారు. ఐఐటీ బృందంతో సమన్వయం చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమించి, నెల రోజుల్లోగా నివేదికను పూర్తి చేయాలని సూచించారు. భద్రాచలం ఆలయానికి పోలవరం ప్రాజెక్టు వల్ల కలిగే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. 2022లో వచ్చిన వరదల సమయంలో 27 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని పట్టణం నీట మునిగిందని అధికారులు సీఎంకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి బానకచర్ల ప్రాజెక్టుపై కూడా నీటిపారుదల శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక అభ్యంతరాలను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించాలని తెలంగాణ అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు, అవసరమైతే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని నీటిపారుదల శాఖను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై అధికారులను నివేదిక కోరిన రేవంత్ రెడ్డి !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق