కేంద్ర ప్రభుత్వం ప్రజలకు హైటెక్ పాన్ కార్డ్లను జారీ చేసే లక్ష్యంతో పాన్ 2.0 అనే కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఉన్న పాన్ కార్డ్లను మరింత సెక్యూర్, ఎఫిషియంట్గా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అడ్వాన్స్డ్ ఫీచర్లతో పాన్ కార్డ్ను అప్గ్రేడ్ చేసేందుకు పాన్ 2.0 ప్రాజెక్ట్ను లాంచ్ చేసింది. ఇప్పటికే పాన్ కార్డ్ కలిగి ఉన్న వ్యక్తులు పాన్ 2.0 కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. అర్హులైన పౌరులందరికీ కొత్త హైటెక్ పాన్ కార్డులను ఆటోమేటిక్గా అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్గ్రేడ్ చేసిన పాన్ కార్డ్ జారీ అయ్యే వరకు, ఇప్పటికే ఉన్న పాన్ కార్డ్లు చెల్లుబాటలో వుంటాయి. ఇప్పటికే పాన్ కార్డ్ ఉంటే, అప్గ్రేడ్ చేసిన వెర్షన్ మీకు జారీ అయ్యే వరకు వేచి చూడవచ్చు. ప్రస్తుత పాన్ కార్డ్లో పేరు, అడ్రస్ లేదా ఇతర సమాచారం వంటి ఏవైనా వివరాలను అప్డేట్ చేసే ఆలోచనలో ఉంటే రెండూ పనులు ఒకేసారి పూర్తవుతాయి. నేరుగా అప్డేట్ అయిన వివరాలతో పాన్ 2.0 కార్డ్ జారీ అవుతుంది. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండటం చట్టవిరుద్ధం. ఒక వ్యక్తి మల్టిపుల్ పాన్ కార్డులను కలిగి ఉంటే, తప్పనిసరిగా ఆదాయ పన్ను శాఖకు ఒక దానిని సరెండర్ చేయాలి. అలా చేయకపోతే, మీ వద్ద ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్నాయని అధికారులు గుర్తిస్తే.. రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
పాన్ కార్డ్ ఉన్న వారు పాన్ 2.0 కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు !
الأربعاء، 4 ديسمبر 2024
national science technology ఆటోమేటిక్గా అందజేస్తామని ప్రభుత్వం హామీ పాన్ కార్డ్ ఉన్న వారు పాన్ 2.0 కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు
ليست هناك تعليقات:
إرسال تعليق