తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో విలన్ గా నటించిన మోహన్ రాజ్ కన్నుమూశారు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన మోహన్ రాజ్ గురువారం అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. తెలుగులో లారీ డ్రైవర్, శివయ్య, అసెంబ్లీ రౌడీ, సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి వంటి సినిమాల్లో విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. మోహన్ రాజ్ దాదాపు 300 లకు పైగా సినిమాల్లో నటించారు. మోహన్ రాజ్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, రాష్ట్ర సాంస్కృ తిక శాఖ మంత్రి సాజి చెరియన్ సంతాపం తెలిపారు. మోహన్ లాల్ నటించిన కిరీడమ్ చిత్రంలో కీరిక్కడన్ జోస్ గా మోహన్ రాజ్ కు మంచి గుర్తింపు వచ్చింది. మూడు దశాబ్దాల పాటు సాగిన ఆయన కేరీర్ లో అనేక ముఖ్య మైన విలన్ పాత్రలను పోషించి మలయాళ సినిమా రంగంపై చెరగని ముద్ర వేశారు.
ホーム
/
సమరసింహారెడ్డి
/
నటుడు మోహన్ రాజ్ కన్నుమూత !
الجمعة، 4 أكتوبر 2024
cinema అసెంబ్లీ రౌడీ చెన్నకేశవరెడ్డి వంటి సినిమాల్లో విలన్ తెలుగులో లారీ డ్రైవర్ దాదాపు 300 లకు పైగా సినిమాల్లో నటించారు నటుడు మోహన్ రాజ్ కన్నుమూత శివయ్య సమరసింహారెడ్డి
ليست هناك تعليقات:
إرسال تعليق