భారత్ 4జీ విధానానికి అనుగుణంగా ప్రత్యేక సిమ్ హ్యాండ్‌సెట్‌ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రముఖ సెల్‌ఫోన్ల తయారీ కంపెనీ 'కార్బన్ మొబైల్స్'తో జతకట్టినట్టు ఎక్స్ వేదికగా బీఎస్ఎన్‌ఎల్ ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్‌లు అందుబాటులోకి వస్తే ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు అవసరం లేకుండానే 4జీ సేవలను పొందవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. కీలకమైన ఈ ఒప్పందంలో భాగంగా ప్రత్యేక సిమ్ హ్యాండ్‌సెట్లను అందుబాటులోకి తీసుకురానున్నామని ప్రకటించింది. కార్బన్ మొబైల్స్ తో కలిసి దేశంలో ప్రతి మూలకు సరసమైన 4జీ కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఈ మేరకు కార్బన్ మొబైల్స్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నామని ప్రకటనలో బీఎస్ఎన్ఎల్ తెలిపింది. కంపెనీ వ్యవస్థాపక దినోత్సవమైన అక్టోబర్ 1న కీలక ప్రకటన చేసింది. కాగా ఈ కొత్త హ్యాండ్‌సెట్‌ ఫోన్లు జియో భారత్ 4జీ ఫీచర్ ఫోన్లతో పోటీ పడనున్నాయి. సరసమైన ధరల్లోనే హై-స్పీడ్ కనెక్టివిటీని అందించే అవకాశాలు ఉన్నాయి.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ