ఆంధ్రప్రదేశ్ లో 'వైఎస్సార్ లా నేస్తం' పథకం పేరును 'న్యాయమిత్ర'గా మారుస్తూ న్యాయశాఖ కార్యదర్శి సునీత జీవో జారీ చేశారు.ఈ స్కీమ్‌ కొత్త మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేస్తామని సునీత తెలిపారు. కాగా యువ న్యాయవాదులకు ఆర్థిక ప్రోత్సాహం అందించేందుకు గత వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్‌ లా నేస్తం స్కీమ్‌ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద లా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన యువ న్యాయవాదులకు గత ప్రభుత్వం నెలకు రూ.5 వేల స్టైఫండ్ అందించింది.

Post a Comment

أحدث أقدم