పశువుల పాకలో మూడు పిల్లలకు జన్మనిచ్చిన చిరుత !


హారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా నాగభీడ్‌ తాలూకా బాలాపూర్‌ గ్రామ పొలిమేరలో ఓ రైతుకు చెందిన పశువుల పాక నుంచి సోమవారం ఉదయం చిరుత బయటకు రావడాన్ని గ్రామస్తులు పశువులను హతమార్చిందేమోనని అక్కడికి వెళ్లి చూశారు. తీరా అక్కడ మూడు చిరుత కూనలు కనిపించాయి. వెంటనే వారు అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. మరోవైపు వారం రోజులుగా ఓ చిరుత ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఆరుగురు వ్యక్తులపై దాడి చేసింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పలు పశువులపైనా దాడి చేసి చంపేసింది.

Post a Comment

0 Comments