ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రాంనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్లోకి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని శాఖల మంత్రులు బాధ్యతలు చేపట్టిన నెల రోజుల తర్వాత బాధ్యతలు చేపట్టిన మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ధర్మాన్ని, దేవుడి ఆస్తులను కాపాడతాన్నారు. గత ప్రభుత్వం హయాంలో తిరుమల నుంచి అరసవల్లి వరకూ భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఆరోపించారు. వాటిని పరిశీలించి అభివృద్ధికి సంబంధించిన అంశంపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రాంనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరణ !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق