తెలంగాణ బడ్జెట్పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. సభకు వచ్చి కూర్చుని వెళ్లి ఇష్టారీతని మాట్లాడారని విమర్శించారు. బడ్జెట్ ప్రసంగం పూర్తికాక ముందే కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై శాసనసభ చేసిన తీర్మానం చర్చలో పాల్గొనేవారని అన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం సూచన మేరకే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి, మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లారన్నారు. కేసీఆర్లా తాము గాలి మాటలు మాట్లాడమన్నారు. ఆయన ప్రభుత్వం దళితబంధుకి 17 వేల కోట్లు కేటాయించి రూపాయి కూడా విడుదల చేయలేదని భట్టి విక్రమార్క ఆక్షేపించారు.
బడ్జెట్ ప్రసంగం పూర్తికాక ముందే కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు !
الخميس، 25 يوليو 2024
telangana డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం పూర్తికాక ముందే కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు బీజేపీ కేంద్ర నాయకత్వం సూచన మేరకే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్
ليست هناك تعليقات:
إرسال تعليق