ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ సోదరుడు ప్రభుదాసును ఇసుక అక్రమ తరలింపు వ్యవహారంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి ఉద్ధండరాయునిపాలెం నుంచి విజయవాడకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను తుళ్లూరు పోలీసులు పట్టుకున్నారు. వాటిని ప్రభుదాసువిగా గుర్తించి ఆయనను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. రెండు లారీలు, కారు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత… ఇలా ఏదో ఒక కేసులో వైసీపీ నాయకులకు ఇబ్బందులు పెడుతోంది టీడీపీ పార్టీ. ఇందులో భాగంగానే…ఇప్పుడు బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ సోదరుడిని అరెస్ట్ చేశారని సమాచారం.

Post a Comment

أحدث أقدم