సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో గంజాయి కలకలం రేపింది. పోలీసులు సోమవారం 62 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి నాందేడ్‌కు రైళ్లలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గంజాయిని సీజ్‌ చేసి.. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

Post a Comment

أحدث أقدم