ఆండ్రాయిడ్ గూగుల్ కంపెనీకి చెందిన సాఫ్ట్ వేర్. ఆండ్రాయిడ్ 15 ఫుల్ వర్షన్ ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో మరో సరికొత్త ఫీచర్ వస్తోంది. అదే.. 'శాటిలైట్ మెసేజింగ్'. మారుమూల ప్రాంతాల్లో నుంచి అత్యవసర పరిస్థితుల్లో మెసేజ్లు చేసుకునేందుకు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. త్వరలో విడుదల కానున్న ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్లో 'శాటిలైట్ మెసేజింగ్' ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా మనం అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడ నుంచైనా, ఎవరికైనా మెసేజ్లను పంపొచ్చు. వైఫై , మొబైల్ నెట్వర్క్ సిగ్నల్స్ లేకున్నా మెసేజ్ను పంపే వీలుంటుంది. ప్రత్యేకించి మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 'శాటిలైట్ మెసేజింగ్' ఫీచర్(Messages Via Satellite) ఇప్పటికే ఐఫోన్స్లో అందుబాటులోకి వచ్చేసింది. అయితే అది అత్యవసర సేవలకు పరిమితం. ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్లో 'శాటిలైట్ మెసేజింగ్'ను అత్యవసర సేవలతో పాటు మెసేజ్లు పంపడానికి, రిసీవ్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఈ ఫీచర్ను వాడుకొని మనం ఫొటోలు, వీడియోలను సెండ్ చేయలేం. గూగుల్ కంపెనీ ఆండ్రాయిడ్ 15 అప్డేట్లో 3 కీలకమైన అంశాలపై దృష్టిసారించింది. అవి ప్రైవసీ/ సెక్యూరిటీ, సపోర్టింగ్ క్రియేటర్స్ అండ్ డెవలపర్స్, మాక్సిమైజింగ్ యాప్ పెర్ఫార్మెన్స్. ఆండ్రాయిడ్ 15 అనేది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. ప్రస్తుతానికి గూగుల్ పిక్సెల్, ట్యాబ్లెట్స్లో మాత్రమే ఆండ్రాయిడ్ 15 డెవలపర్ ప్రివ్యూ 1ను టెస్ట్ చేయడానికి వీలవుతుంది. పిక్సెల్ 8, పిక్సెల్ 8ప్రో, పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో, పిక్సెల్ 7ఏ, పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో, పిక్సెల్ 6ఏ, పిక్సెల్ ఫోల్డ్, పిక్సెల్ ట్యాబ్లెట్ల్లో ఆండ్రాయిడ్ 15ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ లో 'శాటిలైట్ మెసేజింగ్' ఫీచర్ ?
الخميس، 4 أبريل 2024
science technology ఆండ్రాయిడ్ 15 ఫుల్ వర్షన్ ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఆండ్రాయిడ్ లో 'శాటిలైట్ మెసేజింగ్' ఫీచర్ ?
ليست هناك تعليقات:
إرسال تعليق