రిలయన్స్ జియో 4జీ ఫోన్ రూ. 999కి విక్రయిస్తోంది. అయితే, ఈ ఫోన్ అసలు రిటైల్ ధరలో ఎలాంటి తగ్గింపు లేనప్పటికీ, క్రికెట్ అభిమానులు మెరుగైన ప్రయోజనాలతో కొత్త రీఛార్జ్ ప్లాన్ను ప్రకటించింది. జియో సిమ్లో కొత్త రూ.234 ప్లాన్తో రీఛార్జ్ చేసుకునే యూజర్లు 2 నెలల ఫ్రీ ప్లాన్ను పొందవచ్చు. ఈ ఆఫర్ ఏప్రిల్ 1, 2024న లేదా ఆ తర్వాత విక్రయించే జియోభారత్ ఫోన్లపై మాత్రమే వర్తిస్తుంది. రోజుకు 0.5జీబీ డేటాతో పాటు 2 నెలల పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్లను పొందవచ్చు. ఈ ప్యాక్తో కంపెనీ అదనంగా మరో 2 నెలల వ్యాలిడిటీని ఉచితంగా అందిస్తోంది. అయితే, ఆ సమయంలో డివైజ్లో ఉన్న సిమ్ 15 రోజుల రీఛార్జ్ (అర్హత) తర్వాత ఈ బెనిఫిట్ క్రెడిట్ అవుతుంది. అప్పుడే అదనంగా 2-నెలల ఉచిత ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. ఈ యాక్టివ్ ప్లాన్ గడువు ముగిసిన తర్వాత ఆటో-యాక్టివేట్ అవుతుంది. ఈ ప్లాన్ జియోభారత్ ఫోన్ యూజర్లకు మాత్రమే పనిచేస్తుందని గమనించాలి. జియోభారత్ ఫోన్కు ఒకసారి మాత్రమే లేటెస్ట్ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ ఇటీవలే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బాంబే సహకారంతో ‘భారత్ జీపీటీ’ ప్రోగ్రామ్పై పనిచేస్తోందని వెల్లడించారు. జియో 2.0 విజన్ను సాకారం చేసే దిశగా కంపెనీ నిబద్ధతను వివరించారు. భారత్ జీపీటీ ప్రోగ్రామ్ 2014 నుంచి ఐఐటీ బాంబే సహకారంతో చాట్జీపీటీ వంటి పెద్ద భాషా నమూనాల నుంచి ప్రేరణతో జనరేటివ్ ఏఐని ఉపయోగించడమే లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ జీపీటీ ప్రోగ్రామ్తో పాటు, టెలివిజన్ టెక్నాలజీలోకి జియో ప్రతిష్టాత్మక వెంచర్ను అంబానీ ఆవిష్కరించారు. టెలివిజన్ల కోసం సొంత ఆపరేటింగ్ సిస్టమ్ ను అభివృద్ధి చేయడంలో కంపెనీ కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు.
భారత్ 4జీ ఫోన్ యూజర్లకు కొత్త క్రికెట్ రీఛార్జ్ ప్లాన్ !
الخميس، 11 أبريل 2024
2024న లేదా ఆ తర్వాత విక్రయించే జియోభారత్ ఫోన్లపై మాత్రమే science technology ఏప్రిల్ 1 జిఓ భారత్ 4జీ ఫోన్ యూజర్లకు కొత్త క్రికెట్ రీఛార్జ్ ప్లాన్
ليست هناك تعليقات:
إرسال تعليق