పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ప్రతిరోజూ కొత్త స్టార్టప్లు తమ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో భారత్ లో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ విభాగంలోకి ప్రవేశించడానికి ఒబెన్ సంస్థ సిద్ధమైంది కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లుక్ స్పోర్ట్స్ బైక్ ను తలపిస్తోంది. ఈ-బైక్ ఎరుపు మరియు నలుపు డ్యూయల్-టోన్ కలర్లో విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటికే కంపెనీ ఈ బైక్ కోసం 16 పేటెంట్ హక్కులను పొందింది. ఈ బైక్ 3 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని సంస్థ చెబుతోంది. ఒక్క సారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని సంస్థ సహ వ్యవస్థాపకుడు దింకర్ వెల్లడించారు. బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్ కంపెనీ తన మొదటి బైక్ను 2022 మొదటి త్రైమాసికంలో భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. 2 గంటల్లో పూర్తిగా ఛార్జింగ్: ఎలక్ట్రిక్ బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 100 కిమీ. ఇంకా ఇది 3 సెకన్లలో గంటకు 0-40 కిమీ వేగంతో నడుస్తుంది. బైక్లోని బ్యాటరీని 2 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఈ బైక్ లో ఉండే ప్రత్యేక సాంకేతికత బ్యాటరీని చల్లగా ఉంచుతుంది. దీంతో బ్యాటరీ ఎక్కువ కాలం ఉంటుంది.
ఒబెన్ సంస్థ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్ !
الاثنين، 24 يناير 2022
16 పేటెంట్ హక్కులను పొందింది 3 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగం automobile science technologe ఒబెన్ సంస్థ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్
ليست هناك تعليقات:
إرسال تعليق