ఆంధ్రప్రదేశ్ లోని కడపలో వడ్ల గింజలతో గణపతి విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్టించారు. కాలుష్యానికి ఏమాత్రం హాని కలగకుండా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ప్రతి ఏడాది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయనాలతో కూడిన రంగులతో తయారయ్యే విగ్రహాలకు భిన్నంగా తమ బృందం సభ్యులే స్వయంగా పర్యావరణహితంగా గణపతిని రూపొందిస్తున్నట్లు చెప్పారు.పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే తమ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
إرسال تعليق