జమ్మూ కశ్మీర్ లడఖ్లోని లేహ్లో మళ్లీ భూ ప్రకంపనలు వచ్చాయి. గురువారం ఉదయం 9.54 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 4.3గా నమోదయింది. భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వివరించింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కానీ జరగలేదని వెల్లడించింది. అయితే గురువారం ఉదయం 6 గంటలకు భూప్రకంపనలు వచ్చాయని తెలిపింది. దీని తీవ్రత 5.5గా నమోదు అయిందని పేర్కొంది. కేవలం నాలుగు గంటల వ్యవధిలో ఈ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. లడఖ్ తరచూ భూకంపాలు సంభవించే ప్రాంతంగా ఉన్న సంగతి తెలిసిందే.
0 Comments