యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల కోలాహలం నెలకొన్నది. ఆదివారం సెలవు దినంతోపాటు వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకు నేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దర్శనానికి మూడు గంటల సమయం పడుతుందని భక్తులు తెలిపారు. స్వామివారి నిత్యపూజలు కొనసాగుతున్నాయి. స్వామి వారి కల్యాణ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొండపైకి వాహనాలు అధిక సంఖ్యలో రావడంతో కొండ కిందే వాహనాలను నిలిపివేశారు.
యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ : ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق