తెలంగాణలో పదో పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్‌29న ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, స్కూల్ ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్ డైరెక్టర్ నవీన్ నికోలస్​లు పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 5,26,166 మంది విద్యార్థులు టెన్త్‌ పరీక్షలు రాయగా.. 4,97,312 మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్ష ఫలితాల్లో 95.15శాతం ఉత్తీర్ణత నమోదైంది.

Post a Comment

أحدث أقدم