తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో, నటుడు విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే), కమల్ హాసన్ నాయకత్వంలోని 'మక్కల్ నీది మయ్యం' (ఎంఎన్ఎం) పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) గుర్తులను కేటాయించింది. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న విజయ్ పార్టీ టీవీకేకు ఇది ఒక కీలకమైన ముందడుగు. రాష్ట్రవ్యాప్తంగా తమ అభ్యర్థులందరికీ ఒకే గుర్తు ఉండాలని పార్టీ చేసిన అభ్యర్థనను ఈసీఐ ఆమోదించింది. అవినీతి, అక్రమ పాలనపై గళం విప్పేందుకు, ప్రజలను చైతన్యపరిచేందుకు విజిల్ గుర్తు తమ విధానాలకు ప్రతీకగా నిలుస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. విజయ్ రాజకీయ ప్రవేశంతో ఇప్పటికే యువతలో ఉన్న ఆసక్తిని ఓట్లుగా మలుచుకోవడంలో ఈ గుర్తు కీలకం కానుంది.మరోవైపు, కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎంకు 'బ్యాటరీ టార్చ్' గుర్తును కొనసాగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. 2021 ఎన్నికల్లో కూడా ఇదే గుర్తుతో పోటీ చేసినందున, ఓటర్లకు సులభంగా గుర్తుండేందుకు, పార్టీ గుర్తింపును కొనసాగించేందుకు తమకు పాత గుర్తునే కేటాయించాలని ఎంఎన్ఎం కోరింది. గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకపోయినా, టార్చ్ లైట్ గుర్తుతో తమ మద్దతును పటిష్టం చేసుకోవాలని కమల్ పార్టీ భావిస్తోంది.
విజయ్ పార్టీకి 'విజిల్' గుర్తు, కమల్ పార్టీకి 'బ్యాటరీ టార్చ్' గుర్తు ఖరారు !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق