తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆమె, గత ఏడాది కాలంలో మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను వివరించారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం వేసిన మొదటి అడుగు 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకమని మంత్రి పేర్కొన్నారు. "రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు నేడు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇది వారి ఆర్థిక స్వయంప్రతిపత్తికి ఎంతో దోహదపడుతోంది" అని ఆమె గుర్తు చేశారు. రాష్ట్రంలోని పొదుపు సంఘాలను మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి తెలిపారు. మహిళా సంఘాల ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, వారికి అవసరమైన రుణ సదుపాయాలను సకాలంలో అందిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారంలో మహిళలకు ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు సీతక్క వెల్లడించారు. జాతర ప్రాంగణంలో వ్యాపారాల కోసం అత్యధికంగా మహిళలకే షాపులు కేటాయించామని, దీనివల్ల వేలాది గిరిజన, స్థానిక మహిళా కుటుంబాలకు ఉపాధి లభించిందని ఆమె సభకు వివరించారు.
మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : అసెంబ్లీలో మంత్రి సీతక్క స్పష్టీకరణ
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق