తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం ఎక్స్ రోడ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. మహారాష్ట్ర నుంచి సుల్తానా బాద్ కు వెళ్తుండగా తెల్లవారు జామున మూడు గంటలకు రోడ్డు మీద ఆపిన బొలెరో ను లారీ డీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. 15 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనాస్థలి దద్దరిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టిన లారీ : ముగ్గురు మృతి, 15 మంది గాయాలు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق