తెలంగాణ లో రాష్ట్ర వ్యాప్తంగా పది మంది ఐపీఎస్లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 2021-22 బ్యాచ్కు చెందిన ఐపీఎస్లను బదిలీ చేసింది సర్కార్. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్, ఆసిఫాబాద్ ఏఎస్పీగా చిత్తరంజన్, భువనగిరి ఏఎస్పీగా రాహుల్రెడ్డి, దేవరకొండ ఏఎస్పీగా మౌనిక, కామారెడ్డి ఏఎస్పీగా చైతన్యరెడ్డి, నిర్మల్ ఏఎస్పీగా రాజేష్ మీనా, జనగామ ఏఎస్పీగా చేతన్ నితిన్, కరీంనగర్ రూరల్ ఏఎస్పీగా శుభం ప్రకాష్, భద్రాచలం ఏఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్, డీజీపీ ఆఫీస్కు అంకిత్కుమార్ అటాచ్.
إرسال تعليق