ఉత్తర ప్రదేశ్ లోని సహరాన్పూర్ జిల్లా గంగో అసెంబ్లీ పరిధిలోని ఖండ్లానా గ్రామానికి చెందిన కుశాల్ చౌహాన్, యూట్యూబ్లో చూసిన వీడియోల ప్రభావంతో తన పొలంలో చందనం సాగు చేయడం ప్రారంభించాడు. ఒక ఎకరా భూమిలో 400 శ్రీగంధం చెట్లను కర్ణాటక నుంచి తెప్పించి నాటాడు. శ్రీగంధం సాగు క్రమంలో, 7-8 ఏళ్ల పాటు పండించుకోవచ్చని తెలిపారు. శ్రీగంధం చెట్టు పూర్తిగా పెరిగి, మార్కెట్లోకి వచ్చేందుకు సుమారు 15 నుంచి 20 ఏళ్లు పట్టవచ్చు. ఆ సమయంలో ఒక్కో చెట్టును రూ.3 నుంచి 5 లక్షల వరకు అమ్ముకోవచ్చు. రైతు ఇతర పంటలతో పాటు చందనం సాగు చేస్తే 15-20 ఏళ్లలో మంచి లాభాలు పొందవచ్చు. అంతేకాక, ఈ సాగులో ప్రత్యేక రసాయన ఎరువుల అవసరం లేకపోవడం రైతులకు బాగా కలిసివస్తుంది. స్థానిక ఎరువులు మాత్రమే చందనం చెట్లకు సరిపోతాయి. కుశాల్ తన చెట్ల రక్షణ కోసం భవిష్యత్తులో సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. మొత్తం 400 గంధపు చెట్లను నాటినట్లు తెలిపారు. ఒక్కొక్క గంధపు మొక్క ఖరీదు సుమారు రూ.150. యూట్యూబ్లో చందనం సాగు పద్ధతులను చూసిన కుశాల్, మంచి పంట పండించి మంచి లాభం పొందే లక్ష్యంతో ఈ ప్రణాళికను ఆచరణలో పెట్టాడు. మార్కెట్లో చందనం కిలో ధర సుమారు రూ.15,000 నుంచి 20,000 వరకు ఉంది. కుశాల్ చౌహాన్ ఇంతకుముందు చెరకు, పూల పంటలను సాగు చేశాడని, ఇప్పుడు చందనం పంటతో పాటు, మరో 7-8 ఏళ్ల పాటు ఇతర పంటలను కూడా హాయిగా సాగు చేసుకోవచ్చని తెలిపారు.
إرسال تعليق