ఛత్తీస్గఢ్ లోని బస్తర్ రేంజ్ దంతెవాడ-నారాయణ్పుర్ సరిహద్దులో ఎన్కౌంటర్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో వివిధ ఆయుధాలతోపాటు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అబూజ్మడ్ దండకారణ్యంలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా సిబ్బంది ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులకు దిగగా, భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. దీంతో ఏడుగురు మూవోయిస్టులు మరణించినట్లు అధికారులు తెలిపారు.
ఛత్తీస్గఢ్ భారీ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق