మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అమెరికా పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. ఫిలాడెల్ఫియా ఎయిర్‌పోర్ట్‌లో గ్రాండ్‌ వెలకమ్‌ లభించింది. ప్రవాస భారతీయులు భారీ సంఖ్యలో ఆయనకు స్వాగతం పలికారు. ఎన్‌ఆర్‌ఐలకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు మోదీ.. వాళ్లిచ్చిన బహుమతులను స్వీకరించారు. డెలావర్‌లో జరిగే క్వాడ్‌ దేశాధినేతల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు. మూడు రోజుల పాటు అమెరికాలో మోదీ పర్యటన కొనసాగుతుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారు. డ్రోన్‌ డీల్‌పై కూడా ఇరుదేశాల మధ్య చర్చలు జరిగే అవకాశముంది. ఈ సదస్సును అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌ ఏర్పాటు చేశారు. ఆదివారం యార్క్‌లో జరిగే ప్రవాస భారతీయుల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు. దాదాపు 14 వేల మంది ప్రవాస భారతీయులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ప్రవాస భారతీయుల సదస్సు ప్రధాన వేదికపై గ్రామీ అవార్డ్ నామినీ చంద్రికా టాండన్, స్టార్ వాయిస్ ఆఫ్ ఇండియా విజేత ఐశ్వర్య మజుందార్ సహా 382 మంది జాతీయ, అంతర్జాతీయ కళాకారులు వివిధ సాంస్కృతిక కళలు ప్రదర్శిస్తారు. ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సభలో మోదీ కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ మోదీ పర్యటన చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అటు డెమోక్రటిక్‌ పార్టీ నేతలతో పాటు ఇటు రిపబ్లికన్‌ పార్టీ నేతలతో మోదీ సమావేశమయ్యే అవకాశముంది. దీనితో పాటు ఆయన తన పర్యటనలో కొన్ని ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలను కూడా నిర్వహించనున్నారు.

Post a Comment

أحدث أقدم