హారాష్ట్ర లోని నవీ ముంబయిలో యువతిని దారుణంగా హత్య చేసిన ప్రేమోన్మాది ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. హత్య అనంతరం పరారీలో ఉన్న నిందితుడు పర్వతాల్లో దాగి ఉండగా పట్టుకున్నారు. కర్ణాటకకు చెందిన దావూద్‌ షేక్‌ ప్రేమించమంటూ ఓ యువతిని కొంతకాలంగా వేధిస్తున్నాడు. పెళ్లికి నిరాకరించడంతో ఆమె వ్యక్తిగత ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. తనను కలవాలంటూ బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. ఆమెను కలిసేందుకు ఇటీవల ముంబయి వెళ్లిన దావూద్‌ యువతిని దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత పరారయ్యాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు కొన్ని రోజులుగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుడికి సంబంధించి పలు కీలక విషయాలు దర్యాప్తులో వెల్లడయ్యాయి. ఆమెను హత్య చేసి పరారైన దావూద్‌ కర్ణాటకకు చేరుకున్నాడు. తన ఫోన్‌ను అమ్మమ్మ ఇంట్లో పెట్టి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.  ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు వాహనాల్లో కాకుండా కాలి నడకన సమీపంలోని పర్వతాలకు చేరుకున్నాడు. అలా కొన్ని రోజులుగా పర్వతాల మధ్య దాక్కున్నాడు.నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. గూఢచారుల సమాచారంతో దావూద్‌ ఆచూకీ గుర్తించిన పోలీసులు తాజాగా అతడిని అరెస్టు చేశారు. గతంలోనూ అతడిపై కేసు నమోదైనట్లు దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో విచారణకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం 2019లో దావూద్‌కు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. 

Post a Comment

أحدث أقدم