ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే రక్షణ పరిశోధన , అభివృద్ధి సంస్థ కు 600 ఎకరాల భూమిని కేటాయించడానికి ఆమోదం తెలిపింది. ఈ కేంద్రం ద్వారా సుమారు 140 అత్యాధునిక యుద్ధ విమానాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పుట్టపర్తి ప్రాంతంలో సుమారు 1 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. గతేడాది మే 24, 2025న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి ఈ ప్రాజెక్టును తన రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. బెంగళూరుకు సమీపంలో ఉండటం పుట్టపర్తికి ప్రధాన కలిసొచ్చిన అంశం. విమానాల సిస్టమ్స్ డిజైన్, టెస్టింగ్, అసెంబ్లీ పనులను బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ పర్యవేక్షిస్తుంది. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.15,803 కోట్లుగా ఉంది. ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కోసం ఏడు సంస్థలు ఆసక్తి చూపగా, తుది పరిశీలన తర్వాత టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎల్అండ్టీ , భారత్ ఫోర్జ్ సంస్థలను షార్ట్లిస్ట్ చేశారు. త్వరలోనే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వీరికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేయనుంది. యుద్ధ విమానాల తయారీకి సంబంధించి అధికారులు స్పష్టమైన టైమ్ లైన్ పెట్టుకున్నారు. సెప్టెంబర్ 2027 నాటికి మొదటి ప్రోటోటైప్ సిద్ధం చేయడం, సెప్టెంబర్ 2028 నాటికి విమానం మొదటి విమానం రెడీ చేయడం. మార్చి 2034 కల్లా అన్ని పరీక్షలు పూర్తి అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు సాకారమైతే ఆంధ్రప్రదేశ్ రక్షణ రంగ హబ్గా మారడమే కాకుండా, స్థానికంగా భారీగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
0 Comments