టాటా గ్రూప్‌ ఎలక్ట్రానిక్స్‌ రిటైల్‌ కంపెనీ 'క్రోమా' క్రిస్మస్, కొత్త ఏడాది సందర్భంగా ఆఫర్లు ప్రకటించింది. గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, గృహోపకరణాలపై డీల్స్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ప్రారంభ ధర రూ.12,999తో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ పొందవచ్చు. దీనికి అదనంగా రూ.4,999 విలువైన స్మార్ట్‌వాచ్‌ను(బ్రాండ్లను బట్టి) ఉచితంగా అందిస్తుంది. పార్టీ స్పీకర్లను రూ.2199 ప్రారంభ ధరతో అందిస్తుంది. సౌండ్‌బార్లపై 80% వరకు తగ్గింపు లభిస్తుంది. అన్ని క్రోమా స్టోర్లు, క్రోమా ఆన్‌లైన్‌ పోర్టల్‌ కొనుగోలుపై ఈ ఆఫర్లు పొందవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఈ ఆఫర్లు జనవరి రెండో తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. 

Post a Comment

أحدث أقدم