తమిళనాడులోని మదురై జిల్లా మేలూరు, దాని పరిసర ప్రాంతాలలో ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని సాగించిన కోట్ల రూపాయల మోసం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 'FQL' అనే ఆన్లైన్ మొబైల్ యాప్లో డబ్బులు పెట్టుబడి పెడితే కొద్ది నెలల్లోనే రెండింతలు లాభం వస్తుందంటూ నమ్మబలికి, ఆ ప్రాంతంలోని వృద్ధులు, మహిళల నుంచి గత రెండేళ్లుగా ఈ భారీ మోసానికి పాల్పడ్డారు. గత నెల రోజులుగా ఇన్వెస్టర్లకు ఎలాంటి లాభాలు రాకపోవడమే కాకుండా, పెట్టిన పెట్టుబడులు కూడా వెనక్కి రాకపోవడంతో ప్రజలు లబోదిబోమంటూ మోసపోయామని గ్రహించి ఆందోళనకు దిగారు. ఈ స్కామ్లో కీలక ఏజెంట్లుగా వ్యవహరించిన వ్యక్తుల ఇళ్లపై ఆగ్రహించిన బాధితులు దాడి చేసి ధ్వంసం చేయడంతో పాటు, మదురై - మేలూరు జాతీయ రహదారిపై బైఠాయించి ఆకస్మిక రాస్తారోకో చేపట్టడంతో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించిపోయింది.
0 Comments