Ad Code

ఏఐ యుగం టెక్ అప్‌గ్రేడ్ కాదు, ఆర్థిక వ్యవస్థకు రీసెట్: జియో ప్లాట్‌ఫార్మ్స్ లిమిటెడ్ గ్రూప్ సీఈఓ మ్యాథ్యూ ఉమెన్


బార్సిలోనాలోని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో  జియో ప్లాట్‌ఫార్మ్స్ లిమిటెడ్ గ్రూప్ సీఈఓ మ్యాథ్యూ ఉమెన్ మాట్లాడుతూ ప్రపంచం కేవలం "నిమిషాలు, బైట్స్" నుండి బయటికి వస్తోంది. ఇప్పుడు కొత్త ఆర్థిక వ్యవస్థ "టోకెన్స్, ఇంటెలిజెన్స్" మీద ఆధారపడి ఉంటుంది. ఆయన చెప్పినట్లే, ఇండస్ట్రియల్ యుగం ఉత్పత్తిపై ఆధారపడి ఉండేది, ఇంటర్నెట్ యుగం కనెక్టివిటీ, క్లౌడ్ అందించింది. కానీ AI యుగం మొత్తం ఆర్థిక సమీకరణాన్ని మార్చివేస్తుంది. "ఇది అప్‌డేట్ సైకిల్ కాదు, ఇది పూర్తి రీసెట్" అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా AIలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి ఈ మార్పు తీవ్రతను చూపిస్తుంది. జియో కంపెనీ దృష్టిని వివరిస్తూ, "ఈ మార్పు టెలికాం ఇండస్ట్రీకి పెద్ద అవకాశం చూపిస్తుంది. జియో కేవలం నెట్‌వర్క్ ప్రొవైడర్‌గా ఉండకుండా 'ఇంటెలిజెన్స్ గ్రిడ్' బిల్డర్‌గా చూడటం కావాలి. టెలికాం కరెన్సీ నిమిషాల నుండి బైట్స్‌కి, ఇప్పుడు టోకెన్స్‌కి మారుతోంది. మన లక్ష్యం పెద్ద టోకెన్ పైపు మాత్రమే కాదు, పెద్ద టోకెన్ జనరేటర్ అవ్వడం" అని చెప్పారు. టెలికాం ఇండస్ట్రీని నిమిషాలు, బైట్స్, టోకెన్స్ ద్వారా సరళంగా వివరించవచ్చు. మొదట వాయిస్ కాలింగ్ ఆదాయం మూలం. ఇది నిమిషాలలో కొలుస్తారు. తరువాత డేటా వచ్చింది. కస్టమర్ ఎంత బైట్స్ వాడాడో కొలుస్తారు. భవిష్యత్తులో ఇది AI టోకెన్స్‌గా మారుతుంది. ఇందులో AI కంప్యూటేషన్, మోడల్ ఇన్ఫరెన్స్, ఆటోమేటెడ్ డిసిషన్స్, మెషీన్-టు-మెషీన్ ఇంటరాక్షన్ వంటి ఇంటెలిజెంట్ సర్వీసెస్ ఉంటాయి. జియో భారతదేశంలో వాయిస్ ఫ్రీ చేశారని, డేటా ధరను జీబీకి 9 సెంట్స్‌కు తగ్గించారు. 5.25 కోట్ల కంటే ఎక్కువ యూజర్లకు డిజిటల్ కనెక్టివిటీ తీసుకువచ్చారు అని గుర్తు చేశారు. తదుపరి లక్ష్యం "టోకెన్-పర్-వాట్ తక్కువ ఖర్చులో" అందించడం, అంటే పెద్ద స్కేల్ ఇంటెలిజెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కస్టమర్లకు అందించడం. AI కమాండ్ ఆర్కిటెక్చరల్ ఫ్రేమ్‌వర్క్ గురించి చెబుతూ, భవిష్యత్తు నెట్‌వర్క్ విభిన్న టూల్స్ సమూహం కాకుండా, ఒక ఏకీకృత, ఇంటిగ్రేటెడ్ ఆర్కిటెక్చర్ అవ్వబోతోంది. AI, టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కలిసి రియల్ టైమ్‌లో ఆలోచించే, కోఆర్డినేట్ చేసే, చర్యలు తీసుకునే సిస్టమ్స్ సృష్టిస్తాయి. టెక్నాలజీ లీడర్‌షిప్ ఇప్పుడు ఆర్థిక లీడర్‌షిప్‌గా మారింది, భవిష్యత్తులో దేశానికి ఇది నిర్ణయించేది. ఎనర్జీ, ట్రాన్స్‌పోర్ట్, ఫైనాన్స్, సెక్యూరిటీ వంటి సెక్టార్లలో ఇంటెలిజెన్స్ ఎంబెడ్ చేయడం అవసరం. ఇది టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా జరుగుతుంది. AI మార్పు కొందరికి భయాన్ని కలిగించవచ్చు అని ఊమెన్ గుర్తించారు. కానీ దీన్ని "మన జీవితాల్లోనే పెద్ద అవకాశం" అని పేర్కొన్నారు. ఈ మార్పును స్వీకరించే ఆపరేటర్లు భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థలో నాయకులు అవుతారు. మన జీవితాల్లో AI కేవలం సాంకేతిక పరిష్కారం మాత్రమే కాదు, ఆర్థిక, సోషల్, బిజినెస్ ప్రతి రంగాన్ని మార్చే శక్తి కలిగి ఉంది. మనం ఈ మార్పును సద్వినియోగం చేసుకుంటే, భవిష్యత్తు మరింత సమర్థవంతమైనది, అందరికీ లాభకరమైనది అవుతుంది.

Post a Comment

0 Comments

Close Menu