Ad Code

నరేంద్ర మోడీకి 'ఒలియ్ దరజాలి దోస్త్లిక్' ఆర్డర్‌ను ప్రదానం చేసిన ఉజ్బెకిస్తాన్

జ్బెకిస్తాన్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన 'ఒలియ్ దరజాలి దోస్త్లిక్' ఆర్డర్‌ను భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రదానం చేసింది. వాణిజ్యం, స్వచ్ఛ ఇంధనం, కనెక్టివిటీ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే లక్ష్యంతో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్ వెళ్లిన ప్రధాని మోడీకి, ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్ స్వయంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేశారు. ఈ గౌరవం అందుకోవడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేస్తూ, ఈ అవార్డును భారత్-ఉజ్బెకిస్తాన్ మధ్య ఉన్న శాశ్వత బంధానికి అంకితమిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం అందుకోవడం తనకు దక్కిన వ్యక్తిగత గౌరవం కాదని, ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని స్పష్టం చేశారు. 'దోస్త్లిక్' అనే పదానికి 'స్నేహం' అని అర్థమని, భారతదేశంలో ప్రతి కుటుంబానికి ఈ పదం ఎంతో సుపరిచితమని ఆయన గుర్తుచేశారు. భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య శతాబ్దాల నాటి చారిత్రక మైత్రి, ఉమ్మడి వారసత్వానికి ఈ పురస్కారం నిదర్శనమని ప్రధాని పేర్కొంటూ ఉజ్బెక్ అధ్యక్షుడు, అక్కడి ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అవార్డు ప్రదానానికి ముందు ఇరుదేశాల అధినేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భారత్-ఉజ్బెకిస్తాన్ సంబంధాలను 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచాలని నిర్ణయించారు. 

Post a Comment

0 Comments

Close Menu