Ad Code

నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కి లేదు : మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణాలో బీఆర్ఎస్ పదేళ్ల కాలం లో ఎందుకు గ్రూప్ 1 పరీక్ష ఎందుకు నిర్వహించలేదు, పదేళ్లలో ఎంతో మంది నిరుద్యోగులు ఏజ్ బార్ వల్ల నష్టపోయారని, కేటీఆర్ దీనికి సమాధానం చెప్పగలరా, కాంగ్రెస్ వచ్చాకే గ్రూప్ 1 పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో గ్రూప్ 1 పరీక్షల్లో ఉద్యోగాలు సాధించిన వారిని అడగండి కేటీఆర్ .వారే మీకు సమాధానం చెబుతారు. యువత జీవితాలతో కేటీఆర్ చెలగాటం ఆడుతున్నారు. యువత ని రెచ్చగొట్టే ప్రయత్నం కేటీఆర్ మానుకోవాలి .ఏ నైతిక హక్కుల తో అశోక్ నగర్ గురించి మాట్లాడుతున్నారు,అసలు నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కి లేదు, యువకులు మా పై విశ్వాసం తో ,నమ్మకం తో ఉండండి … మీకు ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu