ఉత్తరప్రదేశ్లోని రావత్పూర్లోని యునైటెడ్ యూనివర్సిటీ విద్యార్థిని అనామిక శుక్రవారం రాత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఆదివారం జరగాల్సిన నీట్ పరీక్షకు ఆమె హాజరు కావాల్సి ఉంది. ఆమె మరణంతో ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అనామిక స్వస్థలం మధ్యప్రదేశ్. ఆమె యూనివర్సిటీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. తన హాస్టల్ గదిలో నిద్రిస్తున్న ఆమె, అనుమానాస్పదస్థితిలో మరణించడం హాస్టల్లో తీవ్ర కలకలం రేపింది. సమీపంలోని విమానాశ్రయ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజేష్ ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం ప్రాథమిక పరిశీలనలో మృతదేహంపై ఎటువంటి గాయాల ఆనవాళ్లు కనిపించలేదు. దీనివల్ల, పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల కారణం నిర్ధారణ అవుతుంది. ఈ విషయాన్ని సదరు విద్యార్థి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
0 Comments